byసూర్య | Tue, Nov 29, 2022, 01:12 PM
ఎల్లారెడ్డి బీజేవైఎం మండల శాఖ తరపున రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మంగళవారం నిరుద్యోగ భృతికోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెరాస రెండవసారి అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి అర్హులందరికీ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు హామీ ఇచ్చి దాదాపు 48నెలలు ఆంటే సుమారు 1, 44, 768రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి చెల్లించవలసి ఉందన్నారు. ఇప్పటికీ ఇంకా నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం స్పందించడం లేదు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఖాళీలను వెంటనే నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిరంకుశ అహంకార పాలనను స్వస్తి పలికి మొండి వైఖరి వీడి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు నరేష్ పీకే , బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శంకర్, మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు జీవన్, పట్టణ బీజేవైఎం ఉపాధ్యక్షులు ప్రశాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.