byసూర్య | Tue, Nov 29, 2022, 01:11 PM
శాంతపూర్ గ్రామానికి చెందిన హనుమవ్వ భర్త పేరు వీరేశం భర్త మరియు అత్తతో కలిసి గ్రామంలో వారి ఇంటిలో నివసిస్తుంది. గత సంవత్సరం నుంచి హనుమవ్వ మానసిక స్థితి సరిగా లేక ఇదివరకు ఒకసారి ఇంటి నుంచి వెళ్ళిపోతే భర్త మరియు ఇద్దరు కుమారులు తీసుకువచ్చారు. తేదీ 28/11/2022. రోజున ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భర్త మరియు పిల్లలు వారి బంధువులు ఇళ్లలో వెతికిన దొరకలేదు. శాంతపూర్ గ్రామ చెరువులో హనుమవ్వ మృతదేహం లభించింది. మానసిక స్థితి సరిగ్గా లేక జీవితంపై విరక్తి చెంది ఆమె మరణించినట్లు భర్త వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైందని ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.