కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ'

byసూర్య | Mon, May 06, 2024, 09:01 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ వెళ్లిన మధుయాష్కీ తిరుగు ప్రయాణంలో ఆలేరు వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్రహనాలను తప్పించబోయి.. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.


తన డ్రైవర్ ముఖేష్ అప్రమత్తత వల్లే ప్రమాదం తప్పిందని మధుయాష్కీ ట్వీట్ చేశారు. 'ఆలేరు సమీపంలో నా కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని రక్షిచే క్రమంలో నా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. భగవంతుని దయ వల్ల ఎవరికీ పెద్దగా నష్టం జరగలేదు. డ్రైవర్ ముఖేష్ తెలివిగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది.' అని మధుయాష్కీ ట్వీట్ చేశారు. గతంలో నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన మధుయాష్కీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతిలో మధుయాష్కీ పరాజయం పాలయ్యారు.


Latest News
 

ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం Sun, May 19, 2024, 05:54 PM
తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM