byసూర్య | Mon, May 06, 2024, 08:57 PM
తెలంగాణలో గతకొన్ని రోజులుగా భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మెుదటివారంలోనే రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాడు. ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు చోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
తాజాగా.. వాతావరణశాఖ మరో గుడ్న్యూస్ చెప్పింది. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడుపై ఓ ద్రోణి ఉండగా.. మహారాష్ట్ర దగ్గర తుఫాను తరహా వాతావరణం ఉందని అన్నారు. ఈ రెండు చోట్ల నుంచి చల్లని గాలులు తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయని..వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని.. ఇవాళ కంటే.. రేపటి (మంగళవారం) నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు.
నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. సాయంత్రం తర్వాత హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నందున ఉక్కపోత ఉంటుందని అన్నారు.