17 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ

byసూర్య | Tue, Nov 29, 2022, 01:09 PM

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 17 వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోమహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్ మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యల పైన అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు డిసెంబర్ 13 నుంచి 16వ వరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని ఆ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రాతినిధులు హాజరవుతున్నారని ఈ మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను బేశరధిగా తిప్పి కొట్టడం కోసం ఒక బలమైన తీర్మానాలు చేయబోతున్నామన్నారు అనంతరం భవిష్యత్తు కర్తవ్యాలతో దేశంలో ఒక బలమైన కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో మతపరమైన ఘర్షణలు తీసుకొచ్చి విద్యార్థులకు మధ్య కలహాలు పెడుతుందన్నారు అలాంటి పరిస్థితులలో విద్యార్థులు అందరూ ఐక్యమై సమస్యలను ఎదుర్కోవాలని అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎండి సయ్యద్ ఉపాధ్యక్షులు రాజేష్ జిల్లా నాయకులు రవి సుల్తాన్ అనిత సుపత్రిక గణేష్ శివ మాస్ అభి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM
వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీకూ ఆ మెస్సేజ్ వచ్చిందా Sun, May 19, 2024, 04:32 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sun, May 19, 2024, 04:29 PM
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై Sun, May 19, 2024, 04:26 PM
తెలంగాణలో మెగాఫుడ్‌ పార్క్‌.. 25 వేల మందికి ఉపాధి Sun, May 19, 2024, 03:51 PM