byసూర్య | Tue, Nov 29, 2022, 01:15 PM
మంథని నియోజకవర్గ మల్హర్ రావు మండలం తాడిచెర్ల గ్రామంలో కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంకు, తాడిచెర్ల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజు గ్రామ ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై మరియు డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనే అంశాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా భూపాలపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల శాఖ బ్యాంకు మేనేజర్ వెంకటరాజం, అసిస్టంట్ మేనేజర్ ఎండీ జాకిర్ హుస్సైన్, సర్పంచ్ సత్తయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.