byసూర్య | Sat, Nov 26, 2022, 02:38 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గం
చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.