byసూర్య | Sat, Nov 26, 2022, 02:31 PM
హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావారణం నెలకొంది. రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే అటవీ సంరక్షణ నియమాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీరి పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజ్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.