byసూర్య | Thu, Nov 24, 2022, 11:23 AM
సెలూన్ పేరుతో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తి పై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. బండ్లగూడ నూరినగర్ కు చెందిన షేక్ అయాజ్, దిల్ సుఖ్ నగర్ స్పా అండ్ సెలూన్ నిర్వహించే బలరాం కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. లలితానగర్ లోని సిగ్నేచర్ స్టూడియో హెయిర్ అండ్ స్కిన్ మేకప్ అకాడమీకి అందమైన యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్టోబర్ 7న స్పాసెంటర్ పై దాడి చేశారు. షేక్ అయాజ్, బలరాంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నిందితుడు షేక్ అయాజ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.