byసూర్య | Thu, Nov 24, 2022, 11:33 AM
కేయూ పరిధిలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 28 వివిధ విభాగాల్లోని సబ్జెక్టుల్లో పీహెచ్డ్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. మల్లారెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 28 సబ్జెక్టుల్లో కలిపి సుమారు 3, 800 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.