byసూర్య | Thu, Nov 24, 2022, 11:03 AM
మంత్రి మల్లారెడ్డి పై బోయిన్ పల్లి పీఎస్ లో కేసు నమోదైంది. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ కు కేసును బదిలీ చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 353, 379 R/W 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారి విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఐటీ సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, ఐటీ అధికారుల సెల్ ఫోన్లు లాక్కున్నారని మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.