byసూర్య | Thu, Nov 24, 2022, 10:10 AM
గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రైతు సమస్యలు భూమి వ్యవసాయ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గండేడ్ లో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.