byసూర్య | Thu, Nov 24, 2022, 10:06 AM
ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలిసే. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నేరాలు సులువుగా అరికట్టవచ్చు అని జిల్లా ఎస్పీ మనోహర్ అన్నారు. బుధవారం ఉప్పునుంతలలోని పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చేతులకు సంబంధించి ఎస్ఐ శేఖర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కొన్ని రిపేర్లలో ఉన్నాయని, ప్రజల భాగస్వామ్యంతో ఎక్కువగా పెట్టేందుకు సాధ్యమవుతుందన్నారు. నేరాలు గుర్తించేందుకు కెమెరాలు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. అచ్చంపేట పోలీస్స్టేషన్లో కేసులకు సంబంధించి రికార్డులను ఎస్పీ మనోహర్ పరిశీలించారు. ఆయన వెంట డి ఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ అనుదీప్, అచ్చంపేట ఎస్సై గోవర్ధన్ ఉన్నారు.