వాస్తవాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి: ఎమ్మెల్యే
byసూర్య |
Wed, Nov 23, 2022, 01:28 PM
శంకర్పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి హుస్సేన్ పూర్ గ్రామాల్లో బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను విని వెంటనే అధికారులకు చేరవేసి తొందరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని ప్రజలను కోరారు.
Latest News