byసూర్య | Wed, Nov 23, 2022, 11:12 AM
హైదరాబాద్ లోని హైటెక్స్ నేటి నుండి మూడు రోజులపాటు పౌల్ట్రీ ఎక్స్ పోకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ఐపీఈఎంఏ, కోళ్ల పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనుంది. దీంట్లో మొత్తం 300 మంది స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుండి 370 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా, 30 వేల మంది విజిటర్స్ సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.