రైలు కింద పడి ఆత్మహత్య

byసూర్య | Wed, Nov 23, 2022, 10:39 AM

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే హెడాకానిస్టేబుల్ పండరీ తెలిపిన వివరాల ప్రకారం. నార్త్ లాలాగూడ శాంతినగర్కు చెందిన సందీప్ గౌడ్(38) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మద్యానికి బాని సైన సందీప్ గౌడ్ భార్య, పిల్లలను హింసించేవాడు. అతడి బాధలు భరించ లేక అతడి భార్య పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సందీప్ గౌడ్ 22న మంగళవారం లాలాగూడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM