byసూర్య | Wed, Nov 23, 2022, 09:33 AM
పాలమూరు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం మహబూబ్ నగర్ కు రానున్నారు. ఆమెతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ బీజే రావు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.