సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో.... మరో ఆరుగురి అరెస్ట్

byసూర్య | Wed, Nov 23, 2022, 02:05 AM

గత కొన్ని నెలల కిందట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి కారణమైన కేసులో తాజాగా పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన కేసులో తాజాగా మరో ఆరుగురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌లోకి దూసుకొచ్చిన వందలాదిమంది నిరసనకారులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా, పదిమంది గాయపడ్డారు. 


ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 81 మందిపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటి వరకు పలు దఫాలుగా 66 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలుకు చెందిన వారు ఉన్నారు. కాగా, ఇప్పటికే అరెస్ట్ అయిన వారు బెయిలుపై బయటకొచ్చారు.


 


Latest News
 

సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM
విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలి Wed, Apr 24, 2024, 01:37 PM