byసూర్య | Tue, Nov 22, 2022, 11:01 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అంజన్కుమార్ యాదవ్ గతంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే స్వచ్ఛంద సంస్థకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. అతడిని ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆమధ్య సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన సంగతి తెలిసిందే.