byసూర్య | Tue, Oct 04, 2022, 08:35 PM
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ రేపు దసరా రోజున కీలక సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి కొత్త పేరును కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.ఈ సమావేశానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరుకానున్నారు. తమిళనాడుకు చెందిన విడుత్తలై చిరుత్తైగల్ కట్చి (వీసీకే) నాయకుడు, ఎంపీ తిరుమావళవన్ కూడా హాజరుకానున్నారు. మంగళవారం హైదరాబాద్కు చేరుకున్న ఆయనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఘనస్వాగతం పలికారు.