రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు

byసూర్య | Tue, Oct 04, 2022, 09:41 PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో యాత్రను విజయవంతం చేసేందుకు మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సామర్థ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి కుడిభుజంగా పనిచేస్తున్నారని సుబ్బరామిరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చే ర‌క‌మ‌ని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM