తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే

byసూర్య | Tue, Oct 04, 2022, 05:29 PM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ తుల్జాభవాని దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.


Latest News
 

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ Tue, Mar 19, 2024, 01:39 PM
10వ తరగతి పరీక్ష కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ Tue, Mar 19, 2024, 01:36 PM
మల్లన్న స్వామికి వడిబియ్యం సమర్పణ Tue, Mar 19, 2024, 01:34 PM
భవాని మందిరంలో కుంకుమార్చనలు Tue, Mar 19, 2024, 01:33 PM
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర Tue, Mar 19, 2024, 01:01 PM