ఎల్లుండి యథావిధిగా టీఆర్ఎస్ సమావేశం
byసూర్య |
Mon, Oct 03, 2022, 02:32 PM
ఈ నెల 5న టీఆర్ఎస్ సమావేశం యథావిధిగా జరుగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేయనున్నారు. అదే రోజు సీఎం కేసీఆర్ పార్టీ పేరును ప్రకటిస్తారు.
Latest News