బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
byసూర్య |
Fri, Sep 30, 2022, 03:18 PM
దసరా శరన్నవరాత్రులను పురస్కరించకుని హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. నవరాత్రుల్లో ఐదో రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అలంకరించారు. ఇందులో ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులున్నారు.
Latest News