byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM
మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావేళ్ళి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డికి 60 వేల, రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ. ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.