byసూర్య | Fri, Sep 30, 2022, 01:42 PM
పెగడపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షడుగా వడ్లూరి ప్రవీణ్ కుమార్ నియామకం చేసి ధర్మపురి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...నా నియామకానికి సహకరించిన మాజీ మంత్రి వర్యులు పట్టభద్రుల శాసన సభ్యులు జీవన్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే యువకులను ఏకం చేసి రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం, అనిల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జీల రాకేశ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జితేందర్ గౌడ్ పాల్గొన్నారు.