byసూర్య | Fri, Sep 30, 2022, 01:41 PM
వేములవాడ రూరల్ మండలం పరిధిలోని ప్రజలందరికి విజ్ఞప్తి ఎస్సై నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాబోయే బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా అందరూ శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. ఎవరైనా గొడవలు పడితే వారిపైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పండుగ సందర్బంగా బంధువులు, చుట్టాల ఇండ్లలోకి వెళ్లితే స్థానిక పోలీస్, ఇంటి పక్క వారికి చెప్పాలని, ఇంట్లో విలువైన వస్తువులు తమ వెంట గానీ, లాకర్ లో గాని భద్రపరచుకోవాలి సూచించారు.