byసూర్య | Thu, Sep 29, 2022, 06:07 PM
మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ప్రియ ఈ ఉదయం బైకుపై బయలుదేరింది. వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. టైర్ల కింద పడి ప్రియ అక్కడికక్కడే చనిపోయింది. వెనుక వైపు చూడకుండా క్రాస్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.