byసూర్య | Thu, Sep 29, 2022, 06:00 PM
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వం ఎంత కర్కశంగా ఉంటుందో తెలంగాణ ఉద్యోగులు గమనించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ఉంటుందని చెప్పారు. టీచర్లకు గడిచిన 5 ఏళ్లలో 73శాతం ఫిట్మెంట్ను ఇచ్చిందని, చరిత్రలో ఏ రాష్ట్రం ఇలా ఇవ్వలేదని అన్నారు. ఏపీ ఉద్యోగులతో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయని తెలిపారు.