![]() |
![]() |
byసూర్య | Thu, Sep 29, 2022, 05:36 PM
ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్ గా మారుతోందా...? బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు పర్యాటక ప్రాంతంగా కేబుల్ బ్రిడ్జి ప్రచారంలోకి వస్తుంటే, మరోవైపు ఆత్మహత్యలు పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. దీంతో రక్షణ వ్యవస్థను ట్యాంక్ బండ్ స్థాయిలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు.