![]() |
![]() |
byసూర్య | Thu, Sep 29, 2022, 04:14 PM
టీపీసీసీ సభ్యులు, ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు పటేల్ అధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలో అధికార పార్టీ మరియు ఇతర పార్టీల నుండి దాదాపు 300 మంది భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొజ్జు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి పేద వారికి న్యాయం జరుగుతుందని, తెరాస పార్టీ ప్రభుత్వంలో కేవలం వారి కార్యకర్తలకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.