byసూర్య | Thu, Sep 29, 2022, 03:12 PM
ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడoగ్ పేట్ కార్పొరేషన్ కు సంభదించిన 14 మంది లబ్ధిదారులకు మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. పేదింటి అడబిడ్డల పెళ్ళిళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేన మామ లాగా దేశంలో ఎక్కడ లేనివిధంగా కళ్యాణాలక్ష్మి, షాది ముబారాక్ పథకాలతో అండగా ఉంటున్నారన్నారు. అందరి దీవెనలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండాలని, ప్రజల తరుపున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముఖ్యమంత్రి ముందుకుతీసుకెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు.