byసూర్య | Thu, Sep 29, 2022, 02:55 PM
సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరో మహేష్ బాబును తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వారి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఇందిరాదేవి చిత్రపటం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.