యాదాద్రి సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
byసూర్య |
Thu, Sep 29, 2022, 03:14 PM
స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అనంతరం అయన మాట్లాడుతూ ఆలయంలో మొదటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయన్నారు. యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి లక్ష్మీ నరసింహ స్వామి ఇలవేల్పుగా కావున మొక్కులు చెల్లించుకుంటున్నారని భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారని చెప్పారు. యాదాద్రి పుణ్యక్షేత్రమే కాకుండా ఒక టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Latest News