byసూర్య | Thu, Sep 29, 2022, 01:53 PM
ప్రతి ఏటా జరుపుకునే బతుకమ్మ పండగ సందర్భంగా నారాయణఖేడ్ నియోజక వర్గం, నూతన నిజాంపేట్ మండలంలోని బల్కంచెల్క తండా లో నిర్వహించు బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరుకానునందున ఏర్పాట్లను నారాయణఖేడ్ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు మఠం బిక్షపతి. బల్కంచెల్క తండా సర్పంచ్ మూడ్ లలిత కిషన్, గ్రామస్తులు , వారితో పాటుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ఉన్నారు.