byసూర్య | Thu, Sep 29, 2022, 01:52 PM
తెలంగాణ సంస్కృతి, సప్రాదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేపట్టినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం గ్రామాలల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను, ఆసరా పెన్షన్ల ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మన అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేలా వారికి ఉచితంగా చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని అన్నారు.