byసూర్య | Sun, Sep 25, 2022, 01:29 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరికి కళ్యాణలక్ష్మీ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న యువకుడు రాలేదన్నాడు. ఎమ్మెల్యే మదన్ వెంటనే “వాడిని తీసుకెళ్లి లోపలేయండి. బట్టేబాజ్ గాడు.” అంటూ దురుసుగా మాట్లాడాడు. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారింది.