byసూర్య | Sun, Sep 25, 2022, 03:24 PM
ఉప్పల్ స్టేడియంలో ఇండియా VS ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మైదానం వద్ద 2500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల 300 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. సా. 4 గంటల నుంచి ప్రేక్షకులు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ప్లేయర్లు 5 గంటలకు స్టేడియానికి చేరుకుంటారు. సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉందని పోలీసులు చెప్పారు.