byసూర్య | Fri, Sep 23, 2022, 01:39 PM
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరుకాని వైద్యులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరు కాని వైద్యుల జాబితాను విజిలెన్స్ అధికారులు వైద్యారోగ్య శాఖకు అందించారు. ఈ నేపథ్యంలో 28 మంది డాక్టర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ 28 మంది వైద్య విధాన పరిషత్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం డ్యూటీ టైమ్లో ప్రైవేట్ ప్రాక్టీస్కు వెళ్తే డాక్టర్స్పై వేటు తప్పదని హెచ్చరించింది.