![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 01:43 PM
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో రూ. 38 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించిన పుస్తకాలు లభిస్తాయని తెలిపారు అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం గ్రంథాలయాల్లో లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ రమాదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.