byసూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM
మహబూబ్ నగర్ జిల్లా లో తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి తో కలసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.