అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ, 5న దసరా పండుగ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

byసూర్య | Fri, Sep 23, 2022, 01:36 PM

పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలో బతుకమ్మ పండుగను అక్టోబర్ 3 వ తేదీన, దసరా పండుగను అక్టోబర్ 5వ తేదీన నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై సమావేశం నిర్వహించారు.  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్దుల బతుకమ్మను  అక్టోబర్ 3వ తేదీన  పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై నిర్వహించుకోవాలని తెలిపారు.


దసరా పండుగను అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ద్వజారోహన నిర్వహించి, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శమీ చెట్టుకు పూజలు నిర్వహించాలని నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మైత్రి మైదానంలో రావణాసురుడి దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, పురోహితులు పాల్గొన్నారు.


Latest News
 

మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : హరీష్ రావు Mon, Jan 20, 2025, 01:10 PM
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ Mon, Jan 20, 2025, 01:07 PM
రోడ్డుపై బైఠాయించి ఆందోళన .. Mon, Jan 20, 2025, 12:52 PM
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Mon, Jan 20, 2025, 12:49 PM
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Mon, Jan 20, 2025, 12:42 PM