byసూర్య | Fri, Sep 23, 2022, 12:41 PM
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ షాద్ నగర్ పట్టణంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అనంతరం బొబ్బిలి చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 200 చెరువులకు గాను మూడు రకాలైన 43 లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.