byసూర్య | Fri, Sep 23, 2022, 12:37 PM
ఈ నెల 25 నాడు టి20 సిరీస్ లో భాగంగా 3 వ మ్యాచ్ మన ఉప్పల్ స్టేడియం జరుగనుంది. టికెట్ల విక్రయాలలో హెచ్. సిఎ మొదట పేటీఎం లో ప్రారంభించిన కొద్దీ సమయానికే సోల్డ్ అవుట్ అని క్లోజ్ చేసారు. ఆ సమయానికే కొద్దిమంది బుక్ చేసుకున్న వారికి క్యాన్సల్ల్డ్ అని మెస్సేజులు వచ్చాయి. ఇక జింఖానా గ్రౌండ్స్ దగ్గరికి వెళ్లి టికెట్స్ తీస్కోవాలనుకున్న అభిమానులకు హెచ్. సి. ఎ చుక్కలు చూపించింది. టికెట్స్ అమ్మకపోవడం కాదు కదా వారి ప్రాణాల మీదికి తెచ్చింది.
జింఖానా గ్రౌండ్స్ దగ్గర కనీస ఏర్పాట్లు చేయకుండా టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించడo వలన టిక్కెట్ల కోసం అభిమానులు ఎగపడ్డారు. ఈ సందర్బంగా పోలీసులు అభిమానుల పై లాటీ ఛార్జ్ చేయడం వలన తొక్కిసలాట జరింగింది. ఈ తొక్కిసలాటలో చాల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న జింఖానా సిబ్బంది, హెచ్ సిఎ మీద చర్యలు తీసుకోకుండా అభిమానులపై లాటీ లాఠీచార్జి చేయడం అమానుషం అని ఇప్పటికైనా టిక్కెట్లను విక్రయాలను ప్రారంభించి ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలి అని కోరారు.