byసూర్య | Fri, Sep 23, 2022, 12:21 PM
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను, 33 గురుకులాలను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో 262 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నాయి. కొత్తగా జిల్లాకు 1 చొప్పున 33 గురుకుల స్కూళ్లు, 15 డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.