byసూర్య | Fri, Sep 23, 2022, 12:23 PM
సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద గురువారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా ఫ్యాన్స్ రావడంతో తోపులాట జరిగింది. గ్రౌండ్ గేట్స్ ఓపెన్ చేసిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సయ్యద్ అలియా అనే బాలికకు గాయాలయ్యాయి. అంతర్గత రక్తస్రావం కావడంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె కళ్లల్లోంచి రక్తం వస్తోందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.