byసూర్య | Thu, Sep 22, 2022, 06:20 PM
దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పినా.. చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం సేకరించామని చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ విధించిందని ఆరోపించారు.