byసూర్య | Thu, Sep 22, 2022, 01:49 PM
ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ టిక్కెట్ల జారీలో జాప్యం జరగడంతో ఈ ఉదయం క్రికెట్ అభిమానులు క్యూ కట్టారు. హెచ్సీఏ తీరుకు నిరసనగా నగరంలోని జింఖానా గ్రౌండ్లో నిరసనకు దిగారు. భారత్-ఆస్ట్రేలియా టీ20 టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన ఓ మహిళ తొక్కిసలాటలో తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. గేటు దగ్గర తొక్కిసలాటతో ఓ మహిళ స్పృహ కోల్పోయిందని, ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయిందని వార్తలు వచ్చాయి. మహిళను రక్షించేందుకు పోలీసులు సీపీఆర్ చేశారనే వార్త వైరల్గా మారింది. అయితే ఈ వార్తలపై స్వయంగా పోలీసులే స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందన్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.