జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
byసూర్య |
Thu, Sep 22, 2022, 01:45 PM
జింఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై వివరణ ఇవ్వాలని హెచ్ సీఏ అధికారులను రాష్ట్ర క్రీడాశాఖమంత్రి ఆదేశించారు. టికెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారంతో సమీక్షకు రావాలని, హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా అధికారులు రావాలని ఆదేశించారు. ఈ నెల 25న జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రాగా, తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.
Latest News