సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి

byసూర్య | Fri, Aug 19, 2022, 09:14 PM

పేదలకు అందించే సబ్సిడీలను ఎత్తివేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని  విమర్శలు గుప్పించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే ప్రధాని మోదీ పాలసీ అని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు.. కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.


ప్రజలకు మంచి చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం చేసే కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేసే పనులు తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తే.. ఊరుకోబోమని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజాన్ని, ప్రజలను కేంద్ర బీజేపీ తక్కువ అంచనా వేస్తోందని కామెంట్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM